*ఏఎస్సై సాంబశివరావును సన్మానించిన ప్రసాదరావు..

Published: Saturday January 28, 2023
తల్లాడ, జనవరి 27 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా ఇటీవల పదోన్నతి పొందిన సాంబశివరావును తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కోశాధికారి పాస్టర్ మేకల ప్రసాదరావు సన్మానించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఏఎస్సైని ఆయన శాలువాలు, పూలమాలలతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు ఈ ప్రాంత ప్రజలకు విధినిర్వహణలో సేవలు అందించి పదోన్నతి పొందడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మల్లికార్జున్ రావు,  రాధాకృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.*