సూపర్వైజర్లుగా ఎంపికైన అంగన్వాడీ టీచర్లు

Published: Monday November 28, 2022

మధిర రూరల్ నవంబర్ 27 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న ఆరుగురు అంగన్వాడీ టీచర్లు  సూపర్వైజర్ గా ఎన్నికయ్యారు. అంగన్వాడీ టీచర్లను గ్రేడ్ 2 సూపర్ వైజర్గా నియమించేందుకు ప్రభుత్వం ఇటీవల పరీక్ష నిర్వహించి ఆదివారం ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో  మధిర మండలంలో నాగవారప్పాడు గ్రామంలో అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న సరిత, ఉష మడుపల్లి అంగన్వాడి టీచర్ సుజాత రొంపి మల్ల అంగన్వాడి టీచర్ సంపూర్ణ గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా ఎంపికయ్యారు అదేవిధంగా వైరా పట్టణంలోని బ్రాహ్మణపల్లి లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ జ్యోతి ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంలో పనిచేస్తున్న జంగా విజయ్ కుమారి గ్రేడ్ 2 సూపర్వైజర్ గా ఎన్నికయ్యారు. వారిని మధిర సిడిపిఓ శారద శాంతి అభినందించారు.