కాశీ అభివృద్ధి పనులపై శ్రీ దుబ్బరాజన్న ఆలయంలో బీజేపీ ప్రత్యేక పూజలు...

Published: Tuesday December 14, 2021

సారంగాపూర్, డిసెంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ డబ్బా రాజేశ్వర స్వామి దేవస్థానంలో బీజేపీ సారంగాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో దివ్య కాశీ భవ్య కాశీ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాశీ సుందరీకరణ మరియు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సందర్బంగా తెలంగాణలో అత్యంత ప్రసిద్ది పొందిన పుణ్యక్షేత్రం శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంలో బిజెపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజేవైయం మండల అధ్యక్షులు దీటి వెంకటేష్ ఉపాధ్యక్షుడు హరీష్ తేలు నరేష్ నీలి నరేష్ ఆకుల పోచన్న పత్తి సంతోష్ రాజు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.