చందానగర్ పోలీసులకు వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు
Published: Tuesday June 01, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి చందానగర్ ఎస్.హెచ్.వో. (సిఐ) క్యాస్ట్రో, వెంకటేష్ (ఎస్ఐ) లపై తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల సంఘానికి ఎన్జీవో ఆక్టివిస్ట్ కసిరెడ్డి భాస్కరరెడ్డి సోమవారం ఫిర్యాదు చేయడం జరిగింది. మూడు కేసులు బుక్ చేసి నేరస్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసికొని, సమగ్ర విచారణ జరిపించాలని, ఈ విషయంలో సైబరాబాద్ కమీషనర్ కూడా స్పందించని కారణంగా ఐజీ, డీజీపీలను సమగ్ర విచారణ జరిపించాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘాన్ని కోరగా నెం. 3076/21 తేది: 31.05.2021గా కేసు నమోదు చేయడం జరిగింది.
Share this on your social network: