ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ టీం

Published: Tuesday January 31, 2023
శంకరపట్నం జనవరి 30 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను  నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ టీం డాక్టర్స్ జ్యోతి, సిమ్లాట్ డాక్టర్ అబ్దుల్ హఫీజ్ ఇమ్లిక్ లు సందర్శించి, వైద్యశాల రికార్డ్ లను తానిఖి నిర్వహించారు. ఈ బృందమ్ ఆరోగ్య కేంద్రం ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి తెలుసుకొని సూచనలు చేసారు. వీరూ పరిశీలించిన రికార్డుల నివేదికను కేంద్రం ఆరోగ్యం శాఖ కు సమర్పిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు, స్థానిక వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాజిద్ ,హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్, వైద్య సిబ్బంది, మతిన్ తదితరులు పాల్గొన్నారు.