గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి లకు నివాళులు అర్పించిన ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు

Published: Monday October 03, 2022
మేడిపల్లి, అక్టోబర్ 2 (ప్రజాపాలన ప్రతినిధి)
జాతిపిత మహాత్మా గాంధీజీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆ మహనీయుల మార్గంలో నడవాలని సూచించారు.దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. 
 ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డి వెంకట్రామిరెడ్డి,  ప్రధాన కార్యదర్శి కే నరోత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వి తిరుపతిరెడ్డి, టీయూడబ్ల్యూజే ఉప్పల్ కాంసెన్సీ అధ్యక్షుడు పల్ల మహేందర్ రెడ్డి,   ఉపాధ్యక్షులు మాదిరాజు సురేష్, అమ్మిశెట్టి శ్రీధర్ రావు, కోశాధికారి యాదగిరి మరియు సీనియర్ జర్నలిస్టు కే చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.