ఆర్ఎస్ఎస్ - సేవ భారతి ఆధ్వర్యంలో ఆక్సిజన్ కన్సంట్రేటర్లు ప్రారంభం.

Published: Friday May 21, 2021

మంచిర్యల జిల్లా ప్రతినిధి, మే20, ప్రజాపాలన : కరోనా బాదితులను ఆదుకోవడానికి ఆర్ఎస్ఎస్ - సేవ భారతి ఆధ్వర్యంలో ఆక్సిజన్ కన్సంట్రేటర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ పట్టణ కర్యవహః కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలోని హోం ఐసొలేషన్ లో ఉంటున్న కోవిడ్ పేషంట్స్ ఆక్సీజన్ స్థాయి తక్కువ ఉన్న వారు సేవ భారతి ఆధ్వర్యంలో ఉన్న ఆక్సిజన్ కన్సంట్రేటర్లు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సేవ భారతి స్టేట్ ఎక్జిక్యూటివ్ మెంబర్ రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో ఉన్న కోవిడ్ బాధితులకు హోం ఐసోలేషన్ లో ఉంటున్న వారికి ఆక్సీజన్ స్థాయి 92 నుండి 94 మధ్య ఉన్న వారికి 5 రోజుల కోసం ఉచితంగా ఆక్సిజన్ కన్సంట్రేటర్ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఉన్న వారు తమ హెల్ప్ లైన్ నంబర్ 9160603222 నంబర్ ను గాని లేదా హైటెక్ సిటీ రోడ్ నం 29 లో ఉన్న మా కార్యాలయంలో గాని సంప్రదించి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అందజేసిన వారికి అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి విభాగ్ సహా సేవా ప్రముఖ ( ప్రచారక్) రామాచారి, ఆర్ ఎస్ ఎస్ జిల్లా సహకార వాహ కుమార్ యాదవ్, ఏకలవ్య ఆశ తదితరులు పాల్గొన్నారు.