ఆస్పత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Published: Wednesday December 28, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి: ఈనెల 29 న రాష్ట్ర, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి,హరీష్ రావు ప్రారంభించనున్న బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న పనితీరును, ప్రారంభ ఏర్పాట్లను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం నాడు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే త్వరితగతిన పూర్తి చేసి ప్రణాళికాబద్ధంగా, ఆస్పత్రిని ప్రారంభించే ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్, పలువురు తెరాస నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.