రోడ్డు ప్రమాదంలో నలుగురు కు గాయాలు ట్రాక్టర్ ను డీకొన్న కారు...తృటిలో తప్పిన పెను ప్రమాదం..
Published: Monday December 05, 2022
రోడ్డు ప్రమాదంలో నలుగురు కు గాయాలు
ట్రాక్టర్ ను డీకొన్న కారు...తృటిలో తప్పిన పెను ప్రమాదం..
పాలేరు డిసెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తృటిలో ప్రమాదం తప్పింది. రెప్పపాటు లో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
గాయాలతో బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నుంచి దేవరకొండ కు ఓ పంక్షన్ కు కారు లో చిట్టుప్రోలు కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులతో ఆదివారం వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో
నేలకొండపల్లి మండలం లోని ఆచార్లగూడెం క్రాస్ రోడ్డు వద్ద కు రాగానే కారు ముందు లో ఉన్న ట్రాక్టర్ ఆరెగూడెం వెళ్లేందుకు ఆచార్లగూడెం రహదారి వైపు క్రాస్ అయ్యాడు. ఈ క్రమంలో కారు వెళ్లి ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ సమయంలోనే ట్రాక్టర్ డ్రైవర్ నవీన్ కుమార్ సడన్ బ్రేక్ వేయటంతో ట్రాక్టర్ ట్రక్కు పట్టీ కొట్టింది. కారులో ఉన్న కిరణ్ కుమార్, -భార్య బింధు భార్గవి. తల్లి చంద్రకళ, అత్త రమాదేవి లకుగాయాలైయ్యాయి. వీరిని ఖమ్మం చికిత్స కోసం ఖమ్మం తరలించారు. రెప్పపాటు లో పెను ప్రమాదం తప్పింది. కారు. ట్రాక్టర్ రోడ్డు పై పడటంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు చోరవ తీసుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు నేలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Share this on your social network: