రాధమ్మకు నివాళులర్పించిన జడ్పీటీసీ దిరిశాల ప్రమీల.. తల్లాడ, ఏప్రిల్ 12 (ప్రజా పాలన న్యూస్):
Published: Thursday April 13, 2023
*తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన రైతు సమన్వయ సమితి గ్రామ కన్వీనర్ దొబ్బల సత్యనారాయణ మాతృమూర్తి రాధమ్మ ఇటీవల మృతిచెందారు. బుధవారం ఆ గ్రామంలో ఆమె దశదినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, బీఆర్ఎస్ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు దంపతులు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో వారి వెంట నాయకులు దొబ్బల రంగారావు, కొండపల్లి చంద్రశేఖర్, కళ్యాణపు మధు, తదితరులు ఉన్నారు.*
Share this on your social network: