ఇరిగేషన్ చైర్మన్ నియామకం పట్ల హర్షం

Published: Thursday January 05, 2023

జన్నారం జనవరి 4, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి నియామకం పట్ల బుధవారం మండలానికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు మండల అధ్యక్షుడు అల్లం లచ్చన్న మాట్లాడుతూ రాష్ట్ర ఇరిగేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మండలం నుంచి హైదరాబాదుకు తరలి వెళ్లి వేణుగోపాల చారిని సన్మానించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రేండ్లగూడ సర్పంచ్ నెమలికొండ ఆశరాజ్, పద్మశాలి మండల అధ్యక్షులు చెట్పల్లి గంగయ్య, మాజీ సహకార సంఘం అధ్యక్షులు బాల్తా రాజమౌళి, బి ఆర్ ఎస్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కమ్మల విజయ ధర్మ, పురగిరి పెరిక మండల అధ్యక్షులు వెంబడి సత్యం, తదితరులు పాల్గొన్నారు.