మాజీ ఎం.పీ.పీ పొనుగోటి శ్రీనివాసరావు మంజుల పెండ్లి రోజు సంబరాల నిర్వహించిన సముద్రాల రమేష్

Published: Thursday April 29, 2021

వెల్గటూర్, ఏప్రిల్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం అంబర్ పేట గ్రామంలో మాజీ  ఎమ్.పి.పి తె.రా.స రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస రావు మంజుల వివాహ వార్షికోత్సవం సందర్బంగా సంబరాలను తెలంగాణ ఆర్యవైశ్య సంఘ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు సముద్రాల రమేష్ నిర్వహించారు. అంబారీపేట గ్రామ పంచాయతీ కార్యక్రమంలో మహిళా సంఘ సభ్యులు తో కలిసి బుధవారం తెలంగాణ ఆర్య వైశ్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సముద్రాల రమేష్ కేక్ కట్ చేసినారు. తె.రా.స మండల మహిళా నాయకురాలు ముంజాల మంగ, ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు ఎలుక లక్ష్మి, మల్లేశ్వరి, అల్లంల లక్ష్మి, జువ్వ సుగుణ, మేకల సుప్రియ,దూట లక్ష్మి, ప్రమీల, ఆరెల్లి శాంత మరియు గ్రామ పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.