కొడిమ్యాల సాయిబాబా ఆలయంలో పల్లకి సేవ అన్నదానం

Published: Thursday February 17, 2022

కొడిమ్యాల, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని పూజలు, సత్యనారాయణ వ్రతం, పల్లకి సేవ నిర్వహించి అనంతరం 500 మందికి అన్నదానం నిర్వహించారు. వడ్లకొండ దేవరాజం, కళావతి కూతురు- అల్లుడు వాసం రవికాంత్, నీరజ అన్నదానం ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షులు అంకం జనార్ధన్, ప్రచార కార్యదర్శి  ఏనుగు ఆదిరెడ్డి, సభ్యులు ఎల్లం పరమేష్, చిట్యాలపెళ్లి కళ్యాణ్, పూజారి నాగరాజు శ్రీనివాస్, మహిళలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.