మన్నెగూడేంను నూతన మండలంగా ప్రకటించాలి.

Published: Tuesday July 26, 2022

కోరుట్ల, జూలై 25 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల డివిజన్‌ పరిధిలో ఉన్న మన్నెగూడెంను నూతన మండలంగా ప్రకటించాలని కోరుతూ మన్నేగుడెం గ్రామానికి చెందిన ప్రజలు, జగిత్యాల జిల్లా సర్పంచ్‌ ల ఫోరం అధ్యక్షుడు, స్థానిక గ్రామ సర్పంచ్‌ నరేష్‌ రెడ్డి, ఎంపిటీసి చెన్నమనేని రవీందర్‌ రావు ల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జిల్లా కలెక్టరేట్‌ కు
తరలివచ్చారు. రెండు రోజుల క్రితం మేడిపల్లి మండలంలో ఉన్న భీమారంను కొత్తగా మండలంగా ప్రకటించిన,  నేపథ్యంలో మన్నెగూడెంను కూడా మండలంగా ప్రకటించాలని జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని మన్నేగుడేం గ్రామస్తులు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఆందోళనలో గ్రామ పెద్దలు,యువత ఉన్నారు.