కార్పొరేషన్లోని సమస్యల పరిష్కారానికి కృషి మేయర్ సామల బుచ్చిరెడ్డి

Published: Monday July 05, 2021
మేడిపల్లి, జూలై 4 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మేయర్ సామల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కార్పొరేటర్ బొమ్మక్ సుగుణ బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్లో నెలకొన్న సమస్యలపై కార్పొరేటర్ బొమ్మక్ సుగుణ బాలయ్య మేయర్ సామల బుచ్చి రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం డివిజన్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొంతరబోయిన మహేశ్వరి, కొత్త శ్రీవిద్య, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు వెల్లంకి శ్రీనివాస్ రావు, కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.