ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలి

Published: Tuesday August 30, 2022
కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్ రావు
మేడిపల్లి, ఆగస్టు29 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు మున్సిపల్ అధికారులకు సూచించారు. పాఠశాలలో శానిటేషన్, మరియు వుడిపోయిన టైల్స్ పలు సమస్యల పైన స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది కార్పొరేటర్   బండారు శ్రీవాణి వెంకట్ రావు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్ సోమవారం జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించి, వారికి పలు సమస్యలు వివరించారు. జిహెచ్ఎంసి అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ నాగేందర్, శానిటేషన్ డిఈ చందన స్పందిస్తూ  సమస్యలు రాకుండా చూస్తామని, ఉన్న సమస్యలు తొందరగా పరిష్కరిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, మరియు రామంతపూర్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్రావు పాల్గొన్నారు.