జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలి
Published: Saturday March 11, 2023
* జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్ శంకర్
వికారాబాద్ బ్యూరో 10 మార్చి ప్రజాపాలన : విద్యార్థులు తమ జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్. శంకర్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వికారాబాద్ వార్షికోత్సవ సమావేశం లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరడానికి కఠోర శ్రమే మార్గమని అన్నారు. విద్యార్థులు ఎంసెట్, నీట్, జె ఈ ఈ వంటి ప్రవేశ పరీక్షలు వ్రాయడంతో పాటు మంచి ర్యాంక్ సాధించాలని అన్నారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ సురేశ్వర స్వామి,లైబ్రరియన్ బంధ్యా ఉపన్యాసకులు బుచ్చయ్య, వంశీ కృష్ణ, అర్షియా ఖానం, సమీనా ఖాటూన్, మహేష్, అస్మా బేగం, రేష్మా బేగం,, లతీఫ్, జమాలుద్దీన్, ప్రవీణ్, మతీన్, శిరీన్ ఫాతిమా, జూనియర్ అసిస్టెంట్ సందీప్ కుమార్ పాల్గొన్నారు.
Share this on your social network: