కాంగ్రెస్ పార్టీని భట్టివిక్రమార్క ని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కుమార్ కి లేదు

Published: Friday February 12, 2021
ఖమ్మం ఫిబ్రవరి 11 ప్రజాపాలన: ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మధిర శాసనసభ సభ్యులు భట్టి విక్రమార్క గారిని విమర్శించే స్థాయి నీది కాదు అజయ్ కుమార్ గారు రోజుకి ఒక్క పార్టీ మారే నువ్వు భట్టి విక్రమార్క గారిని విమర్శించే అర్హత నీకు లేదు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే భట్టి ఎక్కడ, అధికారం కోసం రోజుకో పార్టీ మారే. నువ్వు ఎక్కడ నీవు బట్టీని విమర్శించే స్థాయి కాదు విమర్శించడం కాదు.విమర్శలు మానుకోండి ప్రజా సమస్యలపై దృష్టి సారించండి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టండి  ఎన్నికల్లో హామీ లో ఎన్నో పథకాలు ఇస్తామని ప్రజలకు వాగ్దానం చేశారు మోసం చేసి అధికారంలోకి వచ్చారు   ముఖ్యమంత్రిగా కెసిఆర్ మంత్రిగా నువ్వు కొనసాగే నైతిక హక్కు కోల్పోయారు  అధికారంలో ఉండే హక్కుఇక మీకు లేదుు కూడా రోజుల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారు.  నీకు ఎమ్మెల్యే్ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి నువ్వు వెళ్ళిపోయావు  ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది    నిరుద్యోగ భృతి ఇస్తానంది ఇవ్వలేదు వికలాంగులకు వితంతువులకు కొత్త పింఛన్లు రావడం లేదు రేషన్ కార్డులు లేవు రైతులకు రుణమాఫీ రాలేదు  దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అన్నారు చేయలేదు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు తెలంగాణ రాష్ట్రం సమస్యలతో సతమతమవుతోంది  ముఖ్యమంత్రి సీటు కోసం తండ్రి కొడుకు కొట్టుకుంటున్నారు.మిషన్ భగీరథ పేరుతో నిధులు దురాక్రమణ చేశారు రైతులు పంటను కొనుగోలు చేయడం లేదని ఆందోళన చెందుతున్నారు.డబుల్ బెడ్ రూములు ఇస్తామని ఇవ్వలేదు.ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.