మండలానికి అధిక నిధులు కేటాయించిన విప్ రేగా కాంతారావుకి ధన్యవాదాలు తెలిపిన బిఆర్ఎస్ మండల ప్

Published: Thursday December 08, 2022

బూర్గంపాడు (ప్రజాపాలన.)

నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి రేగా కాంతారావు ఆధ్వర్యంలో అధిక నిధులు కేటాయించడంపై బూర్గంపాడు బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారుగా 200 కోట్లు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. అందులో భాగంగానే మండలానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వారు తెలియజేశారు .బూర్గంపాడు మండలంలోని సారపాక పట్టణానికి రోడ్లు ,డ్రైనేజీలు మౌఖిక  పరిస్థితుల కోసం అధిక నిధులు కేటాయించినట్లు వారు ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే కాలంలో మరిన్ని నిధులు కేటాయిస్తామని రోజురోజుకు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని మిషన్ భగీరథ ఇంటింటికి మంచినీళ్లు రైతులకు 24 గంటలు కరెంటు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు తెలంగాణ అభివృద్ధిలో భాగమని పేదవాడికి ఎప్పుడూ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని వారు ఈ సందర్భంగా తెలిపారు..