ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
Published: Monday November 21, 2022
పేదలకు ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు ఆదివారం పంజాగుట్టలోని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చేయూత చారిటబుల్ కృషి, జ్యోతి, టీ ఎక్స్ హాస్పిటల్స్ లైన్స్ క్లబ్ ల భాగస్వామ్యంతో నిర్వహించిన వైద్య శిబిరాన్ని మాజీ ఐపీఎస్ అధికారి హనుమంత రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు కరణ్ పటేల్, జనరల్ ఫిజీషియన్ రీటా, గైనకాలజీ వైద్యురాలు అరుణా లు రోగులను పరిశీలించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ తో పాటుష పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందించారు. కార్యక్రమంలో శ్యామలారెడ్డి, రమణారెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: