గ్రామ సభలో గ్రామ సమస్యలపై అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం

Published: Saturday December 24, 2022
బోనకల్, డిసెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ
 సర్పంచ్ భూక్య సైదా నాయక్ అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బోనకల్ గ్రామ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో సర్పంచ్ భూక్య సైదా నాయక్ కి, పంచాయతీ కార్యదర్శి దామర్ల కిరణ్ కి సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతిపత్రంలో గ్రామంలో కుక్కల బెడద బాగా ఉన్నదని, అలాగే కోతులు బెడద కూడా ఉన్నదని వాటిని వెంటనే పట్టించాలని గ్రామంలో మిగిలి ఉన్న మట్టిరోడ్లను సిమెంట్ రోడ్లుగా మార్చాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం గ్రామ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, మండల వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్ , టిడిపి రైతు సంఘం నాయకులు నందమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.