నవాబుపేట్ మండల యువజన కాంగ్రెస్ ఎఫెక్ట్...!
Published: Monday September 26, 2022
*చిట్టిగిద్ద రైల్వే స్టేషన్ మధ్య గల కల్వర్టు పనులు ప్రారంభం
*నాణ్యతతో కూడిన బ్రిడ్జిని సకాలంలో నిర్మించాలని అధికారులకు విజ్ఞప్తి
* మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గణపురం ప్రసాద్
వికారాబాద్ బ్యూరో 25 సెప్టెంబర్ ప్రజా పాలన : చిట్టిగిద్ద నుండి రైల్వే స్టేషన్ కు వెళ్ళే మార్గంలో కల్వర్టు శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం నుండి చాలా సార్లు నాయకులను ,అధికారులను యువజన కాంగ్రెస్ తరపున ప్రశ్నిచండం జరిగిందని గణపురం ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మార్గంలో ప్రతి రోజు హైదరాబాద్ కు ఉద్యోగ నిమిత్తం వెళ్ళేవారు చించల్ పేట్, అత్తాపూర్ ,అక్నాపూర్ గ్రామస్తులు మండలానికి వస్తుంటారు. అంతేకాకుండా పొలాలకు వెళ్ళే వాళ్ళు కూరగాయలు తీసుకుపోయే వాహనాలు ప్రతి రోజు ఈ బిడ్జ్ పైనుంచే వెళ్తుంటాయి. అధికారులు బ్రిడ్జి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. నాణ్యతతో కూడిన బ్రిడ్జి నిర్మించాలి అని అధికారులను, కాంట్రాక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నవాబుపేట్ మండల ప్రజలకు ఏ ఇబ్బంది కలిగిన యువజన కాంగ్రెస్ అండగా నిలబడుతుందని, మండల ప్రజల తరపున సమస్యలపైన ప్రతి విషయంలో నాయకులను అధికారులను ప్రశ్నించడం జరుగుతుందని భరోసా కల్పించారు. ఏదేమైనా యువజన కాంగ్రెస్ పోరాట ఫలితంగానే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభపరిణామమని కొనియాడారు.
Share this on your social network: