సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Published: Thursday September 22, 2022

మధిర సెప్టెంబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి వెంకటేష్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని నిదానపురం గ్రామంలో పర్యటించారు. అనంతరం ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు, శారీరక శుభ్రత, జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత మరియు వారు తీసుకునే పోషకాహారముపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షణ అధికారి భాస్కరరావు, నిదానపురం సర్పంచ్ బాధ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.