పిటిమెంట్ పై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Published: Wednesday March 24, 2021
జగిత్యాల, మర్చి 22 (ప్రజాపాలన ప్రతినిధి): రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు 30 శాతం ఫిట్ మెంట్ తో పాటు పదవి విరమణ వయస్సును 61 కి పెంచటంపై జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డనాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యోగులు సైతం సేవాభావంతో ప్రజలకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు. నేటి పీఆర్సీ పెంపు ఇతర హామీలతో లక్షలాది ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం వెలుగులు నింపిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
Share this on your social network: