కరోనా జాగ్రత్తల పై ఎమ్మెల్యే ప్రచారం

Published: Friday April 23, 2021

బెల్లంపల్లి, మార్చి 22, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా రెండో విడత ఉదృతంగా విస్తరిస్తూ ఉందని కరోనా బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం నాడు బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ, 24వ, వార్డుల్లో పర్యటిస్తూ కరోనా రెండవ విడత ఉద్ధృతంగా విజృంభిస్తుందని  అత్యవసరం అయితే తప్ప బయటకు ఎవరు రావద్దని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కరోనా బారిన పడి ఏవైనా ఇబ్బందులు ఉంటే అత్యవసర చికిత్స కోసం తనను సంప్రదించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు బస్తీ ప్రజలు పాల్గొన్నారు