మడుపల్లిలో ఖననం చేసిన యువతి శవానికి పోస్టుమార్టం
Published: Thursday March 04, 2021
మధిర, మార్చి 4 ప్రజాపాలన ప్రతినిధి: పూడ్చిన శవాన్ని బయటకు తీస్తున్న సిబ్బంది. మడుపల్లి ఎస్సీ కాలనీలో అనుమానాస్పద స్థితిలో తన కూతురు మరణించిందని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన పూజిత అనే యువతి మృతదేహాన్ని రూరల్ ఎస్సై రమేష్ కుమార్, తహసీల్దార్ సైదులు, డాక్టర్ శ్రావణ్, శ్రీనివాస్ సమక్షంలో బయటకు తీయించి పోస్టుమార్టం చేయించారు.
Share this on your social network: