వర్ధన్ ఆశ్రమ వాసులకు రోటరీ ఆర్థిక సాయం

Published: Tuesday October 25, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 22 అక్టోబర్ ప్రజాపాలన: 
 రోటరీ క్లబ్ మాజీ  డైరెక్టర్ శ్రీ ఐలవరపు  ప్రసాద్ కూతుళ్లు  చిరంజీవులు  ఐలవరపు అశ్విత మరియు అన్విత   సౌజన్యంతో జనగామ జిల్లా వర్ధన్ ఆశ్రమం  బాలికలకు దీపావళి పండుగ సందర్భంగా రూ.20000 ల విలువ దుస్తులు మరియు చెప్పుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి మెంబర్షిప్ ఎక్స్ టెన్షన్ తెలంగాణ రీజియన్ చైర్మన్ డా.ఎంపల్ల బుచ్చిరెడ్డి ,   అసిస్టెంట్ గవర్నర్ గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి,కార్యదర్శి పక్కీర్ కొండల్ రెడ్డి, ఎండి హనీఫ్ మెమన్ కోశాధికారి, ఆశ్రమ నిర్వాహకులు కత్తుల లక్ష్మి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.