రేషన్ బియ్యం విక్రయిస్తే కార్డు రద్దు అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్

Published: Friday November 04, 2022

రేషన్ కార్డు లబ్ధిదారులైన ఒక్కొక్కరికి ఈ నెల కోటాలో 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. బియ్యం విక్రయించే లబ్ధిదారుల రేషన్ కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి త్రినాధ్ బాబు, జీసీసీ డీఎం వాణి, ఎల్ఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జి రవి, ఉప తహసీల్దార్లు కె. వెంకటేశ్వర్లు, సోయం కృష్ణ, శ్రీనివాస్, మహేష్, ఆర్ఐ ఎస్. కె. బాషా తదితరులు పాల్గొన్నారు.