వరకట్న వేదింపులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు శంకరపట్నం మార్చి 02 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Friday March 03, 2023
శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన 21 సంవత్సరాల యువతకి రెండు సంవత్సరాల క్రితమే బొమ్మకల్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఈ దంపతులకు 8నెల పాప కలదు. అయితే పెళ్లి సమయంలో కట్న కానుకలతో పాటు మూడు లక్షల రూపాయల వరకట్నం ఇచ్చి పెళ్లి జరిపించారు. గత కొద్ది రోజులుగా భర్త,అత్త, మామ, ఆడపడుచులు పదిలక్షల అధిక వరకట్నం కోసం వేధిస్తున్నట్లు గురువారం కేశవపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాదితురాలు పేర్కొన్నారు. తన భర్తకు పెళ్లికి ముందు నుంచే మూర్చ వ్యాధి  ఉండగా, ఆ విషయాన్ని దాచి అతనితో తనకి పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేశారని అత్తింటి వారిపై బాధితురాలు ఆరోపించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై దేశ్ చంద్రశేఖర్ విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.