పారిశుద్ధ్య పనిముట్లు పంపిణీ

Published: Tuesday June 15, 2021
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్
వికారాబాద్, జూన్ 14, ప్రజాపాలన బ్యూరో : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34 వార్డులకు నూతన పారిశుద్ధ్య పనిముట్లను పంపిణీ చేశామని వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వార్డును శుభ్రంగా ఉంచి.. స్వచ్ఛ వికారాబాద్ గా పట్టణ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య పనులు చేయడానికి ఉపయోగపడే తోపుడు బండ్లు, గంపలు, పారలు, గొడ్డలి, కొడవళ్ళు, గడ్డపార తదితర పారిశుద్ధ్య పనిముట్లను అందచేశారు. ఈ పనిముట్ల బాధ్యత మున్సిపల్ జవాన్లు తీసుకొని, వార్డులలో పనిచేసే కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, కౌన్సిలర్లు పావని చంద్రశేఖర్ రెడ్డి, గాయత్రి లక్ష్మణ్, గోపాల్, చందర్ నాయక్, రామస్వామి, రాములు, సుధాకర్ రెడ్డి, దేవి రెడ్యా నాయక్, శ్రీదేవి, అనంత లక్ష్మీ విజయేందర్, మురళీ, మున్సిపల్ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.