రామంతాపూర్ విశాల్ మార్ట్ ఎదురుగా నెలకొన్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించండి : ఎమ్మెల్యే బేతి స

Published: Thursday May 20, 2021
మేడిపల్లి, మే19 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ విశాల్ మార్ట్ ఎదురుగా ఉన్న నల్ల పోచమ్మ ఆలయం వద్ద నెలకొన్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. నల్లపోచమ్మ ఆలయం వద్ద ఉన్న డివైడర్ను కొంచెం తొలగిస్తే ట్రాఫిక్ రద్దీని నియంత్రించవచ్చని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గడ్డం రవి కుమార్, గంధం జోత్స్నా నాగేశ్వరరావు, గరిక సుధాకర్ గంగిడి కృష్ణారెడ్డి, గడ్డం సాయికిరణ్, నంది కంటి శివ ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.