బి ఎస్ పి జిల్లా అధ్యక్షుడిగా కాదాసి రవీందర్ నియామకం

Published: Thursday July 07, 2022
మంచిర్యాల టౌన్, జూలై 06, ప్రజాపాలన : బి ఎస్ పి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా   బహుజన ఉద్యమకారుడు, సారాయి వ్యతిరేక పోరాటాలు చేసిన, కోల్బెల్ట్ ప్రాంతంలో అంబేద్కరిజాన్ని ప్రజల్లో ఇమిడింపజేస్తూ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న కాదాసి రవీందర్ ను మంచిర్యాల్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులుగా, రాష్ట్ర  అధ్యక్షులు ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ నియమించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో బి ఎస్ పి పార్టీ ని బలోపేతం చేయుటకు నిరంతరం కృషి చేస్తానని, బహుజన రాజ్యం కోసం పాటుపడతానని అన్నారు.  రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, రాష్ట్ర కో-ఆర్డినేటర్ మంద ప్రభాకర్, ఇంచార్జ్ కో-ఆర్డినేటర్ దేవోళ్ల గంగాధర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
 
 
 
Attachments area