సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ

Published: Wednesday November 30, 2022

బోనకల్, నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని రావినూతల తూర్పు తండాలో ఎంపీపీ నిధుల నుండి కేటాయించిన నాలుగు లక్షల రూపాయల సిసి రోడ్డుకి మంగళవారం ఎంపీపీ కంకణాల సౌభాగ్యం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఈ తండాలో మరిన్ని సిసి రోడ్లు రావడానికి కృషి చేస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, ఎంపీటీసీ కందిమల్ల రాధ, ఒకటో వార్డు మెంబర్ లావూరి వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, గ్రామ కార్యదర్శి గుగులోతు పంతు, ఒకటో శాఖా కార్యదర్శి మంద వీరభద్రం, రెండో శాఖ కార్యదర్శి కొంగర గోపి, మాజీ ఉపసర్పంచ్ గండు సైదులు, సిపిఎం నాయకులు దొండపాటి సత్యనారాయణ, షేక్ అఫ్జల్, సిపిఎం మండల కమిటీ సభ్యులు గుగులోతు నరేష్, తండా పెద్దలు అజ్మీర హర్లా, లావూరి హుస్సేన్, అజ్మీర శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.