నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు...

Published: Monday January 24, 2022
ఎర్రుపాలెం జనవరి 23 ప్రజా ప్రతినిధి: మండలంలోని బనిగండ్లపాడు గ్రామంలో ఆదివారం నాడు బనిగండ్లపాడు గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలను ఘనంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిజంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం ఈనాడు ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిందని, దేశం కోసం చావడానికి సాహసం చేయకపోతే దేశంలో బ్రతికే హక్కు ఎక్కడిది? మనమంతా నిజమైన భారతీయులుగా మసలుకోవాలని, క్షణం సేపు కూడా భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కోల్పోవద్దు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శీలం అక్కిరెడ్డి, ఎన్నం సత్యనారాయణ రెడ్డి, వేమిరెడ్డి వెంకట రెడ్డి, రామిరెడ్డి, ఎన్నం పిచ్చిరెడ్డి, వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీసం శ్రీనివాసరావు, సిలీవేరు వెంకటేశ్వర రావు, నండ్రు వెంకయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.