కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాతఅర్హులందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు

Published: Monday June 13, 2022
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్  మండలం మజీద్ పూర్ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ బీసీ రాష్ట్ర కన్వీనర్ కంటేకార్ రమేష్ జి మజీద్పూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్,  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, నియోజకవర్గంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రజలను పట్టి పీడిస్తూపేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, రైతులకు రైతుబంధు పేరుతో వందల ఎకరాలు ఉన్న  స్వాములకు కోట్ల రూపాయలు పడుతున్నారని ఏమీ లేని పేద వారిని నట్టేట ముంచుతున్నారు అని, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు దాటిన ఏ ఒక్క కొత్త పింఛన్ రాలేదని, కొత్త వారికి రేషన్ కార్డు గానీ రాలేదని, డబుల్ బెడ్ రూమ్ పేరుతో పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారని వీళ్లు ఓట్లు అడగడానికి తప్ప ప్రజా సమస్యలపై ఎప్పుడూ కనిపించని నాయకులని, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ప్రతి ఇల్లు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తామని, ఊర్లో ఎంతమంది ఉన్నా పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్, రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత నాదే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బింగి దాస్, మండల ఎంపిపి బుర్ర రేఖ మహేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేడిపల్లి వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీమేడిపల్లి బాలమ్మ సత్తయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.