కొడంగల్ పట్టన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నయీమ్ సమక్షంలో మిలాద్ ధావత్

Published: Wednesday May 11, 2022
ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి మే 10 : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలో టీపీసీసీ అధ్య క్షులు రేవంత్ రెడ్డి స్వగృహంలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అన్న తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రంజన్ పర్వదిన వేడుకలకు కుల మత పార్టి భేదాలు లేకుండ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధాన్యవాదాలు తేలిపారు. ప్రభుత్వ దోపిడి రాజకీయాల మాటలు నమ్మి పార్టీ లో చేరటం మోసపోవటం ఆపేయండి,స్థానిక ఎమ్మెల్యే రోజుకోక ఊరు తిరగటం హామీలు ఇవ్వటం తప్ప మైనర్టీ లకు చేసింది ఏమి లేదు అని మండి పడ్డారు. ఇకముందు ఆలోచించి నిర్ణయం తీసుకోని రేవంత్ అన్న ను సీఎంగా గెలిపిద్దాం మన నియోజకవర్గం అభివృద్ది ధీశలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో మండలాధ్యక్షుడు నందరం ప్రశాంత్, యూసుఫ్, పట్టన అధ్యక్షులు నయీం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణం రాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..