తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ లో

Published: Saturday April 15, 2023

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వ వైభవంగా జరిగాయి. తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ విధులగుంట అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేద్కర్ నివాళులర్పించారు.   ఏఐసీసీ నాయకులు రమేష్ దారాసింగ్ కాంగ్రెస్ నాయకులు సుకూర్ ప్రభాకర్ గౌడ్ తదితరులు పూలమాలలు వేసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని కార్యవర్గ సభ్యులు నాయకులు మురళి గౌడ్ జిల్లా నాయకులు రమేష్ పట్టణ నాయకులు సుదర్శన్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పులులు మాలలు వేసి నివాళులర్పించారు. తాండూరులో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పైలెట్ రోహిత్ రెడ్డి ప్రసంగించారు .జయంతి సందర్భంగా నియోజకవర్గము నుండి హైదరాబాదుకు బస్సులలో జనం అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. హైదరాబాదులో విగ్రహావిష్కరణ జరుగుతున్న సందర్భంగా బస్సులలో అధికారికంగా ఎంపీడీవోలు ప్రజలను హైదరాబాద్ కు తరలించారు.