త్వరలో జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
జగిత్యాల, డిసెంబర్, 13 ( ప్రజాపాలన ప్రతినిధి): జిల్లాలో త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన ఉండే నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి.రవి, ఎస్పీ సింధూశర్మ పరిశీలించినారు. జిల్లాలో నూతనంగా నిర్మించబడిన సమీకృత కలెక్టరేట్, మాతా శిశు ఆస్పత్రి, మెడికల్ కాలేజ్, టి.ఆర్.ఎస్. పార్టీ భవనాల ప్రారంభోత్సవ& శంకుస్థాపన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి పర్యటన చేసే అవకాశం ఉన్నందున ఈ పర్యటన సందర్భముగా నిర్మాణ పనులు హెలిప్యాడ్ మరియు మోతే ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్ ప్రదేశాలను పరిశీలించారు. నూతన కలెక్టరేట్ భవనం లో మరియు సిఎం పర్యటించే ప్రదేశాల చుట్టూ మొత్తం పచ్చదనంతో, అనవసరపు చెట్ల పొదలను తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ సింధుశర్మ, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ జె.అరుణశ్రీ, జగిత్యాల ఆర్డిఓ ఆర్.డి. మాదురి, ఆర్&బి ఈఈ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల & పోలీస్ అధికారులు, తహసీల్ధార్ పాల్గోన్నారు.
Share this on your social network: