7వ వార్డులో కొనసాగుతున్న జ్వరం సర్వే

Published: Tuesday May 18, 2021
మధిర, మే17, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్వరం సర్వే కార్యక్రమం మధిర అభివృద్ధి ప్రదాత ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి ఆదేశానుసారం మధిర మున్సిపల్ చైర్-పర్సన్ మొండితోక లత జయాకర్ మున్సిపల్ కమీషనర్ ఏ.రమా దేవి గారి నేత్రుత్వంలో మడుపల్లి 7వ వార్డు లో కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాజిటివ్ వచ్చిన వారికి సూచనలు సలహాలు ఇస్తూ అలాగే వారికి పల్స్ రేట్ కూడా చెక్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో మధిర మున్సిపాలిటీ మేనేజర్, తెరాస నాయకులు మేడికొండ కిరణ్, ఇంచార్జి వేణు మెప్మా వేణు, ఏ ఎన్ ఎం సునీలా, మెప్మా సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.