పేదలకు వరం సీఎంఆర్ఎఫ్

Published: Friday December 09, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 8 డిసెంబర్ ప్రజా పాలన : సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దీర్ఘకాలిక, ఖరీదైన వ్యాధులు పేదలకు జీవన్మరణ సమస్యగా మారుతుందని తెలిపారు. పేదల ఆర్థిక సమస్యను పరిష్కరించేందుకు సీఎంఆర్ఎఫ్ భరోసాగా నిలుస్తుందని కొనియాడారు. 2 లక్షల 25వేల రూపాయల 6 చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి పెట్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ గడ్డమీది పాండు ముదిరాజ్ మద్గురు చిట్టెంపల్లి కౌన్సిలర్ గోపాల్ ముదిరాజ్ కొత్తగడి ఊరడి మల్లేష్ ముదిరాజ్ ప్రజాప్రతినిధులు,  పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.