రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి

Published: Tuesday July 20, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలో ప్రజాప్రతినిధుల ప్రవేశం రాజకీయ కుట్రగా భావిస్తున్నామని హైదరాబాద్ జిల్లా స్వేరో అధ్యక్షులు ఎడవెల్లి సురేష్ అన్నారు. విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి వుంటే రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోని గురుకులాలు అభివృద్ధి పధంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతున్నాయని వీటిలో స్వార్థ రాజకీయం చేయడం సిగ్గు చేటని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.