ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 3ప్రజాపాలన ప్రతినిధి *గుడిసిర వాసులకి మద్దతు గా సీపీఎం పార్టీ నాయక

Published: Friday November 04, 2022

అబ్దుల్లాపూర్ మెట్టు మండల కేంద్రంలో సర్వేనెంబర్ 283లో వేసిన గుడిసె వాసులకు మద్దతు తెలియజేస్తూ గుడిసెలో భోజనం చేస్తున్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ. సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, గుడిసె వాసులను సందర్శించి, వారికి మద్దతు తెలియజేస్తూ వెస్లీ  మాట్లాడుతూ ఈ ప్రభుత్వాలు పేదలు గుడిసెలు వేసుకుంటే గుడిసెలు ఊడదీసి కేసులు పెడుతున్నారు. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున కబ్జాలు చేసి ప్లాట్లు చేసే అమ్ముకుంటున్న వారి దగ్గర ఎంగిలి మెతుకుల ఆశపడి వారి దగ్గరికి పోవడం లేదు. కావున అబ్దుల్లాపూర్మెట్ల చేసిన గుడి సేవా దగ్గరికి రావాలంటే ముందు ఎవరైతే ప్రభుత్వ భూమి అక్రమంగా కబ్జా చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ముందు వారి పైన కేసులు పెట్టి వాటిని కూల్చివేసిన తర్వాత గుడిసెల దగ్గరికి రావాలి తప్ప, మా దగ్గరకు వస్తే ఊరుకునేది లేదని, సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం ఈ గుడిసిర వాసులకి ఇళ్లస్థలాలు వచ్చేంతవరకు సిపిఎం పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని ఎన్ని కేసులు అయినా జైల్లో పెట్టిన ఇళ్ల స్థలాల భూములను వదిలేదే లేదని ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ, మండల కమిటీ సభ్యులు, గుండె శివకుమార్, తులసి గారి నరసింహ, గ్రామపంచాయతీ నెంబర్ శ్రీరాములు, మైసమ్మ, అనిత, షాకేరా, లలిత, సౌజన్య, యాదమ్మ, రమాదేవి ఉన్నారు.