అయ్యు బేకరీ నీ ప్రారంభించిన... మేయర్

Published: Friday March 19, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29 డివిజన్ లో అయ్యు బేకరీ ని మేయర్ చిగిరింత పారిజాత నరసింహరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇంత మంచి బేకిరి ఇక్కడ  పెట్టడం వల్ల స్థానికులకు పుట్టినరోజు వేడుకలకు కేక్ గాని తీయటి తినుబండారాలు వివిధ సందర్భాల్లో నేతి మిఠాయి లాంటి దగ్గర్లో ఉన్న బేకరీ ఉండడం ఎంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదని కొనియాడారు. బేకరీ యజమాన్య సభ్యులు మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి కి స్థానిక కార్పొరేటర్ శోభ ఆనంద్ రెడ్డికి, లిక్కి మమతా కృష్ణారెడ్డికి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పెద్దబావి శోభా ఆనంద్ రెడ్డి, లిక్కీ కృష్ణ రెడ్డి, అయ్యూ బేకరీ యజమాన్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.