ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

Published: Friday July 09, 2021

బోనకల్లు, జులై 08, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం రావినూతల గ్రామంలో వైయస్సార్ జన్మదినం సందర్భంగా మరియు వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భరత్ విద్యాసంస్థల అధినేత మరియు వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు లు ముఖ్య అతిధి పెద్దలు శ్రీ శీలం వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మధిర మరియు బోనకల్లు మండలాలలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలకు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న సంక్షేమ రాజ్యం స్థాపనకు ముందుకు కదిలిన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలమ్మ నేతృత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రశ్నించే గొంతుక ఒక బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుందని అలాగే తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నేతృత్వంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ తిరుగులేని శక్తిగా ముందుకు వస్తుందని అదేవిధంగా తెలంగాణ తొలి మహిళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సత్తా ఉన్న నాయకురాలు వైయస్ షర్మిల నాయకత్వంలో తెలంగాణలో కూడా రాజు అన్న సంక్షేమ పాలన ఆరంభానికి సూచిక ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం జరుగుతోందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఎస్కె మౌలాలి గణపవరపు వెంకటేశ్వర్లు శ్రీమతి గోవిందమ్మ తాళ్లూరి వెంకట ఆలూరు ఆర్మోను భూక్యా గోపి ఇరుగు జ్ఞానేశ్వర్ మధిర నాయకులు దేవం భట్ల శ్రీనివాస శాస్త్రి శ్రీమతి కర్ణాటి పద్మావతి శ్రీమతి కొప్పుల విజయ కప్పల భరత్ రెడ్డి రావు నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు