సీతమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి

Published: Thursday October 07, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో గూడు లేక ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్న దుగ్యాల సితమ్మకు తన సొంత ఖర్చులతో ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చిన మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి [Bunty Anna] నిర్మాణం అవుతున్న సీతమ్మ ఇల్లు పనులను ఈ రోజు స్వయంగా వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిపి కృపేష్, వైస్ ఎంపిపి ప్రతాప్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు నర్సింహా, స్థానికులు గ్రామస్తులు, బంటీ యూత్ ఫోర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.