వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు

Published: Friday February 12, 2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 11, ప్రజాపాలన: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో  గురువారం మండలంలోని పోతిరెడ్డిగూడెం గ్రామంలో నూనె గింజల సాగు ప్రోత్సాహం పై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్, మణుగూరు సహాయ వ్యవసాయ సంచాలకులు తాతారావు హాజరై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామక్క మండల వ్యవసాయ శాఖ ఏఓ బి అశోక్ కుమార్, రైతు బంధు సమితి కో- ఆర్డినేటర్ పెండెకట్ల బాటయ్య, ఏఈఓలు లెనిన్, రమ్య, రైతులు పాల్గొన్నారు.