రావినూతల గ్రామంలో శుభకార్యాల్లో పాల్గొని, పలు కుటుంబాలను పరామర్శించిన జెడ్పీ చైర్మన్

Published: Tuesday May 17, 2022
బోనకల్, మే 16 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పర్యటించి మొదటిగా మాజీ టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు భానోత్ కృష్ణ కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం 11వ వార్డు మెంబర్ భానోత్ బేబీ భర్త నాగేశ్వరరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగగా వారిని పరామర్శించారు.
అదేవిధంగా గా గుండగాని కేశవులు ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ , ఎస్టీసెల్ మండల అధ్యక్షులు మూడవత్ సైదా, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బంధం తిరుపతిరావు, షేక్ సైదా, నరసింహారావు,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.