ఘనంగా మహత్మా గాంధీ జయంతి వేడుకలు

Published: Monday October 03, 2022

కోరుట్ల,అక్టోబర్ 02 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలంలోని మాదాపూర్, పైడీమడుగు,కల్లూరు,జోగన్ పల్లి గ్రామంలో మహత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహత్మా గాంధీ భారత దేశ స్వాతంత్ర్యం కోసం సత్యం , ఆహింస మార్గాలలో నడిచి భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఆహర్నిసలు పోరాడిన వ్యక్తి గాంధీ అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల జెడ్పీటీసీ దారిషెట్టి లావణ్య,మాదాపూర్ గ్రామ సర్పంచ్ రాజేష్,ఉప సర్పంచ్ మల్లారెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గడ్డం ఆదిరెడ్డి,కల్లూరు గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, పైడి మడుగు గ్రామ సర్పంచ్ దమ్మ భీమరెడ్డి , గ్రామ ఎంపిటిసి గడికోప్పుల మాధురి గోపాల్, పిఏసిఎస్ ఛైర్మన్ అయిలేని జగన్మోహన్ రావు మరియు యుత్ అధ్యక్షులు మర్రిపల్లి జనార్థన్ , ఉపాధ్యక్షులు బండి శంకర్ , ప్రధాన కార్యదర్శి సంకోజు రవికుమార చారి, జోగన్ పల్లి గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య, ఉప సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి,తేలు రాములు,
బిట్కు సహదేవ్, పోతవేని శేఖర్, ముత్యపు రాజశేఖర్, భూమి వినోద్, పల్లికొండ రాజు, బండి బసయ్య ,సిద్దే సురేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

*కోరుట్ల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో  మహాత్మా గాంధీ జయంతి వేడుకలు*
కోరుట్ల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో  మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి ఎంపీపీ తోట నారాయణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటీ వెంకటరావు, ఎంపిటిసి గుగ్గిల సురేష్, ప్రియాంక ఎంపీడీవో నీరజ, నాయకులు ధనుంజయ్, రుద్ర శ్రీనివాస్ మరియు సూపర్డెంట్ మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.