నిరుపేద కుటుంబాలకు అండగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్

Published: Monday May 02, 2022

ఇబ్రహీంపట్నం, మే 01 (ప్రజా పాలన ప్రతినిధి ): మండలంలోని ఎర్ర పూర్ గ్రామానికి చెందిన నల్ల తాతయ్య   మరియు రాజేశ్వర్ రావు పెట్ గ్రామానికి చెందిన కనురి గంగాధర్ అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ మెట్పల్లి వారు ఆర్థికంగా బాధపడుతున్న ఆ రెండు  కుటుంబాలను పరామర్శించి 25 కేజీల బియ్యం సంచి మరియు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ రెడ్డి, సురిగి శ్రీనివాస్ గౌడ్, వాసు, భగవత్, మనోజ్.