ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలి మండల పట్టణకాంగ్రెస్ పార్టీ మధిర ఆగస్టు 30 ప్రజాపాలన ప్రతినిధి మ

Published: Thursday September 01, 2022

కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు *సూరం సెట్టి కిషోర్* మాట్లాడుతూ మండల లో,పట్టణంలో అనేక మంది నిరుపేదలు 57 సంవత్సరాలు నిండి ఎటువంటి ఉపాధిలేక  కాలం వేళ్ళ దీస్తున్నారు అలాంటి వారికి ఆసరా పెన్షన్లు మంజూరు కాలేదు.. ఇప్పుడు ఎదో కొంత మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు  చేసి మిగతా వాళ్లకు పెన్షన్లు మంజూరు చేయలేదు.మళ్ళీ 4 సంవత్సరాల తరువాత పెన్షన్లు మంజూరు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పెన్షన్ లు రాని వారికి వెంటనే 30 తేదీ లోపు అప్లై చేసుకోండి అని చెప్పి సైట్ క్లోజ్ చేసినారు.. వికలాంగులు,వితంతువులు,వృద్ధులు మీసేవ చుట్టూ తిరుగుతున్నారు.. ప్రభుత్వం వారు వెంటనే సైట్ ఓపెన్ చేయాలి అని అలాగే అప్లై చేసుకోడానికి మరింత సమయం కేటాయించాలి అని,ఇప్పుడు అప్లై చేసుకున్న వారితో పాటు ఇంతకు ముందు మీ సేవలో అప్లై చేసుకున్న పేదలకు వెంటనే ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.ఈ పత్రికా సమావేశంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిర్యాల వెంకటరమణ గుప్తా* మదిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* మండల సేవాదళ్ అధ్యక్షుడు *ఆదూరి శీను* మధిర పట్టణ మైనార్టీసీల అధ్యక్షుడు *షేక్ జహంగీర్* కాంగ్రెస్ పార్టీ డివిజన్ కమిటీ అధ్యక్షుడు *కోట నాగరాజు,ఆదిమూలం శ్రీనివాసరావు* మొదలగువారు పాల్గొన్నారు